జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ
తెలంగాణ : కరీంనగర్లోని PMJ జ్యువెలరీ షోరూమ్లో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీ బయటికి వచ్చింది. సిబ్బందిని ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.